తాజా వార్తాలు / అమరావతి : ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకూడా 560 అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఇటీవలే హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 50 మార్కులకుగానూ 45 మార్కులకు నిర్వహించిన రాత పరీక్షకు 21,000ల మంది హాజరయ్యారు. మిగిలిన 5 మార్కులకు స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ నిర్వహించారు. మెరిట్ ప్రాతిపదికన 1 : 2 నిష్పత్తిలో 1,194 మందిని స్పోకెన్ ఇంగ్లిష్ టెస్టుకు ఎంపిక చేసి, 3 నుంచి 5 నిముషాల నిడివితో స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోలు రికార్డు చేశారు. ఐతే ఆ తర్వాత ఇంతమంది వీడియోలు చూడటం కష్టమని భావించి మెరిట్ లిస్ట్లో ఉన్నవారిని మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ విడియోలు అప్లోడ్ చేయాలని సూచించడంతో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలితాల ప్రకటన నిలిచిపోయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా స్టేను ఎత్తివేసింది. త్వరలోనే ఫలితాల విడుదలవ్వనున్నాయి.
-----------------------
Admin