తాజా వార్తాలు / అమరావతి : ఒక్కో విడత వారాహి యాత్రలో ప్రభుత్వంపై పలురకాలుగా విమర్శల దాడి చేస్తున్నారు జనసేన అధినేత. మొదటి విడతలో ఇసుక అక్రమాలు వంటి అరోపణలు, రెండో విడతలో వాలంటీర్లపై చేసిన కామెంట్స్ రాజకీయంగా రచ్చకు దారి తీశాయి. మూడో విడతలో విశాఖపట్నం జిల్లా పర్యటనలో రుషికొండ, ఎర్ర మట్టి దిబ్బలు పరిశీలనతో విమర్శల వేడి పెంచారు. ప్రభుత్వంపై విమర్శలు పెంచడం ద్వారా పార్టీకి మంచి మైలేజీ వస్తుందని చెప్తున్నారు. అందుకే నాలుగో విడత యాత్రకు అదే రకంగా ముందుకెళ్లేలా జనసేన అధినేత కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కొంచెం ఆలస్యంగా నాలుగో విడత యాత్ర ప్రారంభించి విమర్శల పదును పెంచేలా ముందుకెళ్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పవన్ వారాహి యాత్ర ఎప్పుడు ఉంటుంది? ఎలాంటి టార్గెట్తో ముందుకు వెళ్తారు అనేది రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.
-----------------------
Admin