తాజా వార్తాలు / గుంటూరు : కందుకూరు ఘటన మరిచిపోక ముందే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో మళ్లీ తోపులాట జరిగింది. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన అనంతరం గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సభా వేదిక వద్ద ఒకరు మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరులో నిర్వహించిన మీటింగ్ లో కానుకల కోసం మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో చంద్రబాబు వెళ్లిన తర్వాత పంపిణీ కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. పులువురి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో ఏటీ అగ్రహారానికి చెందిన రమాదేవి ఒకరు ఉండగా.. మరో ఇద్దరి సమాచారం తెలియాల్సి ఉంది..
-----------------------
Admin