తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : రణస్థలం ధ శాంతినికేతన్ స్కూల్ నిర్వహించిన 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆంధ్రా యూనివర్సిటీ గాంధీయన్ స్టడీస్ కేంద్రం డైరెక్టర్ ప్రోపెసర్ చల్లా రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమన్నారు. బాపూజీ అనుసరించి మార్గం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలన్నారు. మేమున్నాం సేవ సంస్థ అధ్యక్షులు పచ్చిగుళ్ళ సాయిరాం ను బెస్ట్ గాంధీయన్ ఆఫ్ 2022 అనే పురస్కారాన్నితో ఆయన సత్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ చల్లా కృష్ణ వీర్ మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ భావాన్ని పెంచుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో స్కూల్ డైరెక్టర్ వై.టి సార్, ఎండి ఎన్.కళావెంకట్రావు మరియ పాఠశాల సిబ్బంది విద్యార్థులనుద్దేశించి ఉపన్యనించారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు పురస్కారాలను, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
-----------------------
Admin