తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : మూడు రాజధానులు కేవలం భ్రమే తప్ప దిశా నిర్దేశం లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. రాజాంలో ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే విధంగా మంత్రుల మాట తీరు ఉందన్నారు. ఉత్తరాంధ్ర మంత్రుల మాటలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు, ఉత్తరాంధ్రలో భూములను,ప్రజల సొత్తును దోచుకుని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైసీపీ నాయకులకి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని నిరుద్యోగ సమస్య పెరిగి పరిశ్రమలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి నెలకొని ప్రభుత్వ రాబడి కూడా పూర్తిగా తగ్గిందని ద్వజమెత్తారు.ఇది కేవలం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. తోటపల్లి,మడ్డువలస నీరు సకాలంలో అందక రైతులు నష్టపోతున్నారు అన్నారు. మూడు సంవత్సరాలుగా ఐదు లక్షల ఎకరాలకు సకాలంలో వర్షాలు పడినా డ్యాముల ద్వారా కాలువలలోకి నీరు అందక రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొన్నాయని మాజీ మంత్రి కళా వెంకటరావు వైసీపీ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు గుప్పించారు.
-----------------------
Admin