Tuesday, 14 May 2024 11:25:31 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మూడు రాజధానులు కేవలం భ్రమేఃమాజీ మంత్రి క‌ళావెంక‌ట్రావు

Date : 15 September 2022 04:46 PM Views : 238

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : మూడు రాజధానులు కేవలం భ్రమే తప్ప దిశా నిర్దేశం లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. రాజాంలో ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అమరావతిని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే విధంగా మంత్రుల మాట తీరు ఉందన్నారు. ఉత్తరాంధ్ర మంత్రుల మాటలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు, ఉత్తరాంధ్రలో భూములను,ప్రజల సొత్తును దోచుకుని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైసీపీ నాయకులకి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని నిరుద్యోగ సమస్య పెరిగి పరిశ్రమలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి నెలకొని ప్రభుత్వ రాబడి కూడా పూర్తిగా తగ్గింద‌ని ద్వ‌జ‌మెత్తారు.ఇది కేవలం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. తోటపల్లి,మడ్డువలస నీరు సకాలంలో అందక రైతులు నష్టపోతున్నారు అన్నారు. మూడు సంవత్సరాలుగా ఐదు లక్షల ఎకరాలకు సకాలంలో వర్షాలు పడినా డ్యాముల ద్వారా కాలువలలోకి నీరు అందక రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొన్నాయని మాజీ మంత్రి కళా వెంకటరావు వైసీపీ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు గుప్పించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :