Wednesday, 15 May 2024 04:17:50 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూడురోజులు లిక్కర్ షాపులు బంద్

Date : 11 March 2023 04:29 PM Views : 169

తాజా వార్తాలు / అమరావతి : ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మూడు రోజుల పాటూ లిక్కర్ షాపులు మూతపడనున్నాయి.ఆంధ్రపదేశ్‌లోని మందుబాబులకు చేదు వార్తే ఇది. ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండటం చేత 3 రోజుల పాటూ వైన్ షాపులు, బార్లు క్లోజ్ అవ్వనున్నాయి.ఉత్తరాంధ్ర జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు మార్చి 13న జరగనున్న దృష్ట్యా జిల్లాలో 3 రోజుల పాటు అన్ని రకాల లిక్కర్ షాప్స్ మూసివేస్తున్నట్లు విశాఖ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రకటన జారీ చేశారు.జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గవర్నమెంట్ నడుపుతున్న లిక్కర్ షాప్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్, స్టార్‌ హోటల్స్‌లోని బార్స్, టూరిజం బార్స్, నేవల్‌ క్యాంటీన్స్, మద్యం డిపోలు, కల్లు దుకాణాలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అన్ని రకాల మద్యం షాపులు మూతపడనున్నాయి.అలాగే ఓట్ల కౌంటింగ్ జరిగే 16వ తేదీన కౌంటింగ్‌ సెంటర్స్ సమీప ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాప్స్ తెరవడం జరగదన్నారు.ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :