Wednesday, 15 May 2024 03:40:35 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకే ఛాన్స్‌? అధికారికంగా ప్రకటించే అవకాశం?

Date : 15 May 2023 08:37 PM Views : 177

తాజా వార్తాలు / అమరావతి : కర్ణాటక సీఎం పదవిపై హైడ్రామా కొనసాగుతోంది. ఢిల్లీకి చేరిన రాష్ట్ర రాజకీయంపై తీవ్ర ఉత్కంట నెలకొంది. అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్‌లు నువ్వా.. నేనా అన్నట్లు సీఎం కుర్చి కోసం పోటాపోటీగా ఉన్నారు. అయితే ఈ ఉఠ్కంటను తెరదించేందుకు ఖర్గే నివాసంలో కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండేలు సమావేశం అయ్యారు. ఈ వ్యవహారం నేపథ్యంలో సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, డీకే శివకుమార్‌ బెంగళూరులోనే ఉన్నారు. తనకు ఆనారోగ్య కారణంగా ఢిల్లీకి వెళ్లడం లేదని ప్రకటించారు. ఇక కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండేలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకుని సీఎం పదవి అభ్యర్థిపై చర్చిస్తున్నారు.ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం పదవి సిద్దరామయ్యకే ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్యకే సీఎం పదవి కట్టబెడితే మరి డీకే శివకుమార్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, బెంగళూరులోని సదాశివనగర్‌లో తన నివాసంలో డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. నాకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలేనని అన్నారు. నాకు సమయస్ఫూర్తి, పోరాట పటిమ ఉంది. పోరాటంలో విజయం సాధించాలంటే ఓపిక పట్టాలి. ధర్మ రాయల లాగా ఓపిక పట్టాలి. సీఎం పదవి గురించి హైకమాండ్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని అన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :