తాజా వార్తాలు / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఘనంగా నౌకాదళ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన నౌకా దళ విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.విశాఖపట్నం ఆర్కే బీచ్లో నౌకాదళ దినోత్సవం సందర్భంగా దళ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలు తిలకించారు. ఐఎన్ఎస్ సింధు వీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఏపీ మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన నౌకాదళ గీతం ఆకట్టుకుంది. భారీగా తరలివచ్చిన సందర్శకులతో ఆర్కే బీచ్ జన సంద్రంగా మారింది.
-----------------------
Admin