Wednesday, 15 May 2024 12:30:12 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయనే.. కీలక ప్రకటన చేసిన అమిత్‌షా..

Date : 17 January 2023 04:23 PM Views : 199

తాజా వార్తాలు / అమరావతి : బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా(జేపీ నడ్డా) పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని ప్రకటించారు. జేపీ నడ్డా నేతృత్వంలోనే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు అమిత్‌షా. జూన్‌ 2024 వరకు నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగుతారని తెలిపారు. నడ్డా పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదించింది.బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో నడ్డా కీలక పాత్ర పోషించారని అమిత్‌షా తెలిపారు. తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఏర్పడిందన్నారు. లక్షా 30 వేల బూత్‌లెవెల్‌ కమిటీలను నడ్డా నిర్మించారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2024 జూన్ వరకు బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారని అమిత్ షా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మహమ్మారి కోవిడ్‌ను ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వచ్చింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో పల్లెపల్లెకు సేవా కార్యక్రమాలను తీసుకెళ్లారు. రోగులను ఆసుపత్రికి పంపడం.. వారిని అన్ని విధాలుగా సహకరించడం చేశారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి పాపులారిటీని పెంచడంలో జేపీ నడ్డా కూడా సహకరించారని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :