తాజా వార్తాలు / అమరావతి : 2019లో జాన్సన్ బేబీ పౌడర్ నమూనాలను సేకరించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిలో పరిమితికి మించి pH ఉన్నట్లు నిర్ధారించింది. 2020లో అమెరికా, కెనడాలలో దీని ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 2021లో కంపెనీకి షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 15న జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు చేసింది కూడా. తాజాగా దీనిని సవాలు చేస్తూ జాన్సన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు మరోమారు నమూనాలను సేకరించి టెస్ట్ చేయవల్సిందిగా ఆదేశించింది. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లు రుజువైతే తక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ వినియోగిస్తే క్యాన్సర్ ప్రమాదం ఉందనే ఆరోపణలతో ఇప్పటి వరక దాదాపు 38 వేల వ్యాజ్యాలను ఎదుర్కొంది. పీహెచ్ అనేది యాసిడిక్ లేదా ఆల్కలీన్ స్వభావం ఉండే ఓ పదార్ధం. ఇలాంటి వాటిని సాధారణంగా సౌందర్య ఉత్పత్తులో వినియోగిస్తుంటారు. కాస్మటిక్ వంటి డ్రగ్స్తో ముడిపడిన వ్యవహారం గనుక నెలలు, ఏళ్ల తరబడి ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయ వ్యవధిలో పని చేయావల్సి ఉంటుందని హైకోర్టు మంగళవారం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కి సూచించింది. ఈ కేసుకు సంబంధించిన ఉత్తర్వులు కోర్టు బుధవారం జారీ చేయనుంది.
-----------------------
Admin